Thursday 19 January 2017

అధివాస్తవ విస్మృతి



ఈ నిరామయ సాయంత్రాన

ఎవరిని గుర్తుకు తెచ్చుకొని

రోదించను?


ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య

లోయలో

గుబురుగా ఎదిగిన పొదలతో

నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది


మెల్లగా, భ్రమలాగా

మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి


ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు

కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు


ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద

రెండు పుష్పాలు ఉంచారు

రెండు కన్నీటి బొట్లూ రాల్చారు

ఆమె ఎవరో గుర్తులేదు


ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు


కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తు లేదు


కవిత మరియు డిజిటల్ ఆర్ట్ : శ్రీరామ్ 

(సారంగ సాహిత్య పత్రికలో ప్రచురితం) 



No comments:

Post a Comment